Monday, May 6, 2024

యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతం

యాదగిరిగుట్ట, ప్రభ న్యూస్‌: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాల య పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ అన్నారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి వారిని దర్శించుకొని అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఏఈవో గజవెల్లి రమేష్‌బాబు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం పూర్తయిన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఒక యజ్ఞంలా ఆలయ పునర్నిర్మాణం చేపట్టారన్నారు. పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే స్వర్గంలోకి అడుగు పెట్టినట్లు ఉందన్నారు. ప్రసాయిల్‌ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ కుమార్‌, నటరాజ్‌, నటుడు శేషాద్రి, క్యాసగళ్ల చందు, మాటూరి అరుణ్‌, వీరభద్రం తదితరులు వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement