Wednesday, April 24, 2024

గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై పవన్ దిగ్భ్రాంతి

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం అని చెప్పారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన తండ్రి  రాజమోహన్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement