Friday, May 17, 2024

శ్రీసాయి…భక్తులకు రక్షణ కవచం

భగవంతుని అద్భుతమైన, అపూర్వమైన, కరుణ కటాక్షములకు పాత్రులమైన వారు ఎంతో అదృష్టవంతులు. మట్టికుప్పలోని రాయి వంటి వారు క్షణాలలో అతి విలువైన వజ్రంలా మారిపోతారు. వారి కీర్తిప్రతిష్టలు దిశదిశలకు ప్రాకిపోతాయి. అయితే ఈ అదృష్టం అంద రికీ లభించదు. అనన్య చింతనతో, తీవ్రమైన తపనతో, సాధనతో భగవంతునికి సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్త శ్రేష్టులకు మాత్ర మే ఈ భాగ్యం లభ్యం. శ్రీ సాయినే తమ సద్గురువుగా నమ్ముకొని రేయింబవళ్ళూ భక్తిశ్రద్ధలతో ఆరాధన చేసిన హమాద్రిపంత్‌, నానా చందోర్కర్‌, దాసగణు మహారాజ్‌, తాత్యాకోటే పాటిల్‌, మహల్సా పతి, మాధవరావు దేశ్‌పాండే (శ్యామా) వంటి వారు సామాన్య స్థితి నుండి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు,
వారసు లకు సైతం నేటికీ శ్రీ సాయి రక్షణ కవచం లభ్య మౌతూనే వుంది.
ఒకసారి దాసగణు మహారాజ్‌ ఈశావాస్యోపనిషత్తు పై మరాఠీ భాషలో వ్యాఖ్యానం వ్రాయడానికి సంకల్పిం చాడు. ఈ గ్రంథ రాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం వుంది. వేద సంహతలోని మంత్రములు వుండడంతో దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. దీనికి వాజసనేయ సం#హతోపనిషత్తు అని మరొక పేరు కూడా వుంది. ఆన్ని ఉపనిషత్తుల కంటే శ్రేష్టముగా దీనిని పండితులు భావిస్తారు. ఈశా వాస్యోపనిషత్తు గ్రంథములో ఆత్మను గూర్చి అపూర్వమైన వర్ణన వుంది. గురువు స్థానంలో వుండే యోగి శ్రేష్టుల గుణముల గూర్చి విపులంగా వ్రాయబడి వుంది. కర్మ యోగమును, జ్ఞాన మార్గమును సమన్వయం చేసిన అద్భుత కావ్యంగా ఈ ఉపనిషత్తు గూర్చి పండితులు తెలియజేసారు. ఇటువంటి అపూర్వ గ్రంథముపై వ్యాఖ్యానం వ్రాయడానికి దాసగణు ప్రారంభించి, రాత్రిబంవళ్ళూ ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసాడు. కాని ఆ గ్రంథం సరిగ్గా అతనికి అర్ధం కాలేదు. ఎందరో పండితులను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నాడు కాని సంతృప్తికరంగా అతనికి సమాధానం లభించలేదు.
చివరకు ఒక పండితుడు దాసగణుతో ఈ పవిత్రమైన గ్రంథా న్ని అధ్యయనం చేయడం, వివరించి చెప్పడం అంత సుళువు కాద ని, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు వద్దకు వెళ్ళి ఆయన ఆశీర్వా దములను పొందమని సలహా ఇచ్చాడు. తాను ఇంతకాలం ఏవిధం గా కాలయాపన చేసాడో గుర్తించిన దాసగణు వెంటనే శిరిడీ వెళ్ళి, శ్రీ సాయి కాళ్ళపై పడి తనకు వచ్చిన కష్టాన్ని తీర్చమని ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో ఆశీర్వదించి ”ఏమాత్రం తొందర పడవద్దు. తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని దీక్షిత్‌ కాకా పనిపిల్ల నీ సందేహా లను తీరుస్తుందని” అన్నారు. ఆ మాటలు విన్న ఇతర సాయి భక్తులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. శ్రీ సాయి తమతో హాస్యమా డుతున్నారని భావించారు. లేకపోతే చదువు సంధ్యలు లేని ఒక అనా మకురాలు దాసగణు యొక్క సందేహాలను ఎలా తీరుస్తుంది? ఇది అసాధ్యం అని అందరూ భావించారు.
కాని సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మాత్రం శ్రీసాయి మాట లపై విశ్వాసముంచి శిరిడీ నుండి బయలుదేరి విలేపార్లేలోని కాకా సా##హబ్‌ దీక్షిత్‌ ఇంట్లో బస చేసాడు. ఆ మరునాటి ఉదయం దాసగ ణు నిద్రలేవగానే పెరట్లో నుండి ఒక చక్కని పాటను విన్నాడు. దీక్షిత్‌ యొక్క పనిమనిషి చెల్లెలు ఒక ఎర్రచీర గురించి మృదుమనో#హ రంగా పాడుతోంది. ఆమె చాలా బీద కుటుంబీకురాలు. చిరిగిపో యిన బట్టలను కట్టుకుంది. అయినా తన ఊ#హల్లో మెదిలే ఎర్రచీ ర గురించి చక్కగా పాడుతోంది. ఆమెపై జాలిపడ్డ దాసగణు అప్ప టికప్పుడు ఒక ఎర్ర చీరను కొని ఆమెకు బహూకరించాడు. ఆకలి తో నకనకలాడే వారికి పరమాన్నం దొరికినట్లు ఆ చీరను చూడగానే ఆ చిన్నపిల్ల మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. మరుసటి రోజు ఉదయం ఆ క్రొత్త చీరను కట్టుకొని వచ్చి ఉత్సాహంతో పనిచే సింది. అందరికీ కావల్సినవి చేసి పెట్టింది. ఆమె ముఖం ఆనం దంతో వెలిగిపోయింది. ఆ మరునాడు పాత బట్టలనే ధరించి పనిలోనికి వచ్చింది. అయినా ఆమెలో ఆనందానికి అంతులేదు. నిన్నటి రోజు వలె అదే ఉత్సాహం, ఆనందం! నిరాశా నిస్పృ#హలు అన్నవి మచ్చు కైనా ఆమె ముఖంలో కానరాలేదు. ఇదంతా చూసిన దాసగ ణు జాలి భావం మెచ్చుకోలుగా మారింది. సరిగ్గా అప్పుడే అతనిలో అజ్ఞా నాంధకారాలు పటాపంచలై జ్ఞానజ్యోతులు వెలిగాయి. ఈశా వాస్యోపనిషత్తు కావ్యం యొక్క నిగూఢ రహస్యాలన్నీ సాయి అను గ్రహం వలన క్షణాలలో అవగతం అయ్యాయి.
ఆ పిల్ల కటిక పేదది కావడం వలన చింకిగుడ్డలు కట్టుకుంది. క్రొత్త చీర లభించినప్పుడు దానిని ధరించింది. రెండు సందర్భాల లో కూడా ఆమె ఒకేవిధమైన ఆనందంతో వుంది. చీర వున్నప్పుడు, లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఆమె వుంది. కాబట్టి కష్ట సుఖ ములనే భావనలను మన మనోవైఖరి పైనే ఆధారపడి వున్నాయి. మన పూర్వజన్మ సుకృతం వలన కష్ట సుఖములను, లాభ నష్టముల ను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. భగవంతుడిచ్చిన వాటితో మనము సంతృప్తులై వుండాలి. మనకు ఏమి ప్రసాదించినా అది మన మేలుకోసమేనని గ్రహంచి అన్నింటినీ సమభావంతో స్వీకరిం చి ఆయనకు కృతజ్ఞులమై వుండాలి. ఆ పిల్ల, ఆమె పేదరికం, ఆమె సంతృప్తి, ఆనందం, క్రొత్త చీర, దాసగణు యొక్క దానగుణం, ఇవ న్నీ భగవంతుని ప్రతిరూపాలే! అన్నింటి యందు ఆ భగవంతుడు సమానంగా వ్యాపించి వున్నాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. భగవంతుని అనుజ్ఞ ప్రకారమే మనకు అన్ని సంఘటనలు సంభవి స్తున్నాయి. కాబట్టి ఇతరులను కష్టపెట్టరాదు, ఇతరుల సొత్తుకై మనం ఆశింపరాదు, మనకు వున్న దానితోనే సంతుష్టి చెందవలెను, మనకు ఏమైనా కావల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఆ భగవంతుడినే ప్రార్ధించాలి. అంతేకాక మనం మనకు శాస్త్రములలో విధింపబడిన కర్మలను ఎల్లవేళలా చేస్తుండాలి. భగవంతుని అను గ్ర#హం కోసం సత్కర్మలు ఒనరించుట అన్నింటికంటే మేలు. భగ వంతుడు సర్వాంతర్యామి. జడ, జీవ పదార్ధాలన్నింటిలోనూ సమానంగా వ్యాపించి వున్నాడు. అంతులేని నమ్మకంతో ఒక రాయి ని కొలిచి, ప్రార్ధించినా మన కోరికలను తీరుస్తాడు. ఏ మానవుడైతే సమస్త జీవరాశి యందు కొలువై వున్న భగవత్స్వరూపమైన ఆత్మను దర్శిస్తాడో, అన్ని జీవ, జడ పదార్ధములను ఒకేవిధంగా భావిస్తాడో అతను ఏవిధమైన మోహములకు గురికాడు. ఎటువంటి సంతోష, వికారాలకు గురికాడు.
దాసగణుకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన క్షణంలో జ్ఞానోదయం అయ్యింది. ఈశావాస్యోపనిషత్తులోని అంతరార్ధం, నిగూఢ తత్వం వెంటనే అవగతం అయ్యాయి. ఆ గ్రంథం పై మరాఠీ భాషలో అపూర్వమైన రీతిలో భాష్యాన్ని రచించి శ్రీ సాయికి అంకి తం చేసాడు. ఈశావాస్యోపనిషత్తుపై మనకు లభించే వివిధ భాష్యాల లో దాసగణు మహరాజు రచించిన భాష్యాన్నే అత్యుత్తమైన దానిగా ఇప్పటికీ పండితులు భావిస్తారు.
సర్వం శ్రీ సాయినాధ పాదార
విందార్పణ మస్తు

Advertisement

తాజా వార్తలు

Advertisement