Sunday, April 28, 2024

సాధన సాధ్యతే సర్వం

శివం అంటే మంగళం, ”శ్వశ్రేయం శివం భద్రం కళ్యాణం, మంగళం శుభం” అని అమరకోశంవ్యాఖ్యాని స్తోం ది.. అట్టి పరమ మంగళమైన శివస్వరూపాన్ని అనుసంధానం చేయా లనుక్కునేవారు చేయవలసినదేమిటి?
మొదట విభూతి ధారణ, విభూతి అనగా ఐశ్వర్యం. అది అగ్ని లో కాలి శుద్ధమైన చిట్టచివరి సత్య వస్తువుగా మిగులుతుంది (ఏ వస్తు వుని కాల్చినా మిగిలేది బూడిదే, బూడిదని కాల్చినా మిగిలేది బూడిదే అదే ఆ వస్తువు యొక్క సత్స స్వరూపం). ఆ విభూతిని శివుడు ఒంటి నిండా అలదుకుంటాడు. అంటే సృష్టి వ్యూహ రహస్యాన్ని అంతా విభూతి కణాలలో కూర్చి దానిని తన శరీరానికి అలదకుని కాపాడ తాడు. అంతా బూదిగా మారినా దాన్ని తనక లం కారంగా పూసుకుని తాను మాత్రం అలానే ఏకంగా తనలోతాను రమిస్తూ ఉండిపోతాడు. విభూతి సూచించే ఇంకో విషయం ఏమిటంటే
కాలంలో వచ్చినది కాలంలో కలిసిపోయి కాలాని కతీతుడైన ఆ పరబ్ర హ్మను పట్టుకుని ఆయనలో చేరిపోతుంది. ఆయనే కాలాతీతుడు పరబ్రహ్మ ము అని తెలుస్తుంది రెండవది రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష అంటే శివుని కళ్ళ నుండి పుట్టినది. సాక్షాత్‌ ఆయన మూడవ కన్ను స్వరూపం. దేవతలలో మూడు కన్నులున్న దేవుడు ఈయనే. మూడ వ కన్ను అగ్నికి ప్రతీక అంటే జానాగ్నికి ప్రతీక. సృష్ఠిలో రుద్రాక్ష వంటిది మరొక లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంక ఏ కాయకి, పండుకి, గింజకీ దేనికీ ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తినీ ప్రయోగించి రం ధ్రము చేయనవసరం లేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్య లో రంధ్రంతో ఉంటుంది. మనం కూడా సంసారంలో ఉన్నా జీవనాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్య మైనదానిగా గడపాలని సూచిస్తుంది
మూడవది పంచాక్షరీ మంత్ర జపం. పంచాక్షరీ జపం మంత్ర దీక్షలేని వారు శివ శివ అని జపం చేయాలి.
విద్యానుశ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ
తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇత్యక్షర ద్వయమ్‌!!
వేదములలో ఉత్కృష్టమైనది మధ్యలోనున్న మేలుబంతి వంటిది యజుర్వేదం. ఆ యజుర్వేదంలో నాలుగవ కాండ ఇంకా ప్రశస్తం. ఆందులోని రుద్ర ప్రశ్నలో మధ్యలోని పంచాక్షరి ఇంకా గొప్పది. ఆ పంచాక్షరిలోని శివ అను అక్షర ద్వయం జీవద్వయం. అని అప్పయ దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో చెప్పారు. నాలుగవది మారేడు దళములతో పూజ. లక్ష్మీదేవి ఐదు స్థానాలలో ఎక్కువగా ఉంటుంది. అవి మారేడు, ఆవు వెనక తట్టు, స్త్రీల పాప ట,ఏనుగు కుంభస్థలము, పద్మము. అందుచేత మారేడుచే శివపూజ అత్యంత ముఖ్యం. అంతేకాదు మారేడుతో పూజ ఐశ్వర్యాన్ని, జ్ఞానా న్నీ కూడా కలుగజేస్తుంది.
ఐదవది ధ్యానం, హృదయంలో సదా శివ ధ్యానం చేస్తూ వెలు పలి పూజతోపాటు శివ స్వరూపానుసంధానం ఎడతెగకుండా చేయాలి అదే అభిషేకం. సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ఆ సమ యంలో శివ స్మరణ విధిగా చేయాలి. కనీసం ఐదు నిమిషాలైనా చేసా ్తనని సంకల్పించి మానసికంగా స్మరణమూ వాచికంగా శివనామో చ్ఛారణ చేస్తే ఆత్మోన్నతి కలుగుతుంది.ఏ సందేశమైనా, లేదా సాక్ష్య మైనా మరణ సమయంలో ఇచ్చినది నిక్కచ్చి. భాగవతం అంతటికీ మేలు బంతి. దక్ష యజ్ఞ ధ్వంసం. భాగవతం సందేశం. శివనింద చేయరాదన్నదే పెద్దల వాక్కు. సతీదేవి శరీర త్యాగం చేసి శివుని ద్వేషించిన, అటువంటి వారిని ప్రోత్సహంచిన వారి గతి ఏమో చూపించింది. శివుడొద్దన్నవానికి మంగళమెక్కడిది?
పాపాన్ని ఒకే ఒక్క కోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉం ది. దానికోసం అన్నిచోట్లా వెతకనవసరం లేదు. వేదాలకు జీవ రత్నము, దేహానికి ప్రాణమూ, దేవాలయమునకు మహా లింగము వలె వెలుగుతున్న శివ అనే రెండు అక్షరాలు పాపాలన్నీ పటాపంచలు చేసే పరమౌషధం. మానవునిగా పుట్టి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుక్కునేవారికి శివనామోచ్ఛార ణమే శరణ్య ము. ఆ పరమేశ్వరుడు మనకి నాలుక, వాక్కు ఇచ్చినందుకు పంచాక్షరిని ఉపదేశం చేయ లేకపోతే కనీసం ‘శివ శివ’ అని జపం చేయడమే మన విధి.
అపి వా య శ్చాండాల: శివ ఇతి వచం
విసృజేత్‌ తేన సహ సంవసేత్‌
ఛండాలుడంటే ఏ విధీ లేక అన్ని సంస్కా రాలనూ వదిలి చాతుర్వర్ణాలనూ వదిలి ఉన్న వాడు. శివుడు సర్వ జగత్తుకు తండ్రి. మంచి వారికీ తండ్రి అలాగే చెడ్డవారికీ. దేవతలకూ దానవులకూ కూడా వారు తల్లితండ్రులు. అందుకే జగత: పితరౌ వందే పార్వతీ పర మేశ్వరౌ… అందుకే ఛండాలుడు ఉద్దరింప బడడానికి శివ నామ జపం విధిగా నియ మింపబడింది. అంటే ప్రతి ఒక్కరూ శివ నామ జపం చేయాలి.
యాతే రుద్ర శివాతనూరా ఘోర పాపకాశినీ తయా నస్తను వా శంతమయ గిరిశం తాభిచాకాశీహ
యాతేరుద్ర శివ తనూ: శివా
విశ్వాహ భేషజీ
శివారుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే:
ఆ పరమేశ్వరుడు భక్తులకు అతి మంగళకరుడు, భక్తుల పాలికి వచ్చినవారికి కంకాళాదులతో ఘోరరూపి. ఆయన అ#హం స్ఫురణ ప్రాణమే అంబిక. ఆయన మంగళ కరుడు ఆవిడ సర్వ మంగళ.
శాస్త్రం శారీర మీమాంసా దేవ: శ్రీ చంద్ర శేఖర:
గురు: శ్రీ శంకరాచార్య: నంతుమే జన్మజన్మని!!

ఎన్ని జన్మలకూ నాకు చంద్ర శేఖరుడైన సాంబశివుడే స్వామి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులే గురువులు. ఏ జన్మ ఎత్తినా ఏ అవస్థ లో ఉన్నా శివ నామస్మరణమే శాంతి కారకము.
(శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి
ప్రసంగముల నుంచి)

– దైతా నాగపద్మలత
95027 34852

Advertisement

తాజా వార్తలు

Advertisement