Sunday, April 28, 2024

21న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అదే విధంగా, సర్వదర్శనం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్ల‌ చొప్పున ఆఫ్ లైన్ లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement