Wednesday, May 1, 2024

TTD : తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి గాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే. జనవరి 4వ తేదీ నుండి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల 2వ సత్రం (గోవిందరాజస్వామి సత్రాలు )కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement