Sunday, April 28, 2024

కలి పురుషుడు ఎలా వచ్చాడు

యుగాలు నాలుగు. అవి- కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. యుగాల సృష్టిలో 4వ అన్నదమ్ముడు ‘కలిస‌. ద్వాపర యుగంలో అన్న చెల్లెళ్లకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అంటాము. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయేక సృష్టి అంతమై పోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి.

కలి ప్రభావం
కలియుగంలో కలి పురుషుడు ప్రభావం చాలా దారుణంగా ఉం టుంది. కలి ప్రభావంవల్ల దేవతలకు హవిస్సులందవు. వేదము అవమానింప బడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి. అసత్యం, బంగారం, డబ్బు చాలా ముఖ్యం అవుతాయి. కష్టపడిన వారికి ఫలితం తక్కువ. కష్టపడని వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండ దు. మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతూ వుంటాయి. చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.

పరీక్షిత్తు మహారాజు -ఎద్దు (ధర్మ దేవత)
ధర్మ బద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు (చక్రవర్తి) దేశంలో ఒక రోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది. తనదేశంలో బాధతో అనేది ఉండదు. మహారాజు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు. ఆ గోమాత.. ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయమ చెప్పింది. ఆ ఆవుని ఎద్దు ఊరడిస్తూ ఉంది. (ఆ గోమాత మన భూమి ఎద్దు ధర్మ దేవత) ఏమైందని రాజు అడుగగా, ఎద్దు కాలిద్వారా కలి ఈ యుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది. పరీక్షిత్‌ మహారాజు ఎద్దుతో, ”నిన్ను ఎవరు హింసించారు. ఎవ రికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు” అని అంటాడు. ఎద్దు కాలు విరగొట్టినవారు ఎవ రైనా సరే అతని భుజాలు విరగ్గొడ తాను అంటాడు .
”కాలక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టు కుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు” అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలి పురుషుడని పరీక్షిత్‌ రాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్‌ కలికి శిక్ష విధి స్తాడు. అప్పుడు కలి ”నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురిచేస్తు న్నావు? ఇది కలియుగం కాబట్టి నేను కచ్చితంగా భూమిపైకి రావా ల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్క డికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షి త్తు. తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే నమ్మకంతో.
పరీక్షిత్‌ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకా రం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం.. ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగా రం ఉన్నచోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నా డు కలి పురుషుడు. మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు.

పరీక్షిత్తు మహారాజుపై…
పరీక్షిత్‌ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్‌ ఒంటినిండా బంగా రం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసా త్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది. జీవహింస కూడా ఉండ డంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్లి కిరీ టం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చా త్తాపం కలుగుతుంది.అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా కలి ప్రభావానికిలోనై చివరికిమరణాన్ని కొనితెచ్చుకుంటాడు.

నల దమయంతులపై…
దమయంతి స్వయంవరం ముగిసి, నల మహారాజును వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్టదిక్పాలకులు తిరిగివెళ్లే ప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు. దమయంతిని వివాహమాడ డానికి వెళ్తున్నానంటాడు. ఇంకెక్కడి వివాహం. స్వయంవరం ముగి సింది. ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతినబూనుతాడు. కాని ధర్మబద్ధు డై, నిరంతరం దైవచింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచు కునే నలమహారాజు దగ్గరికి కలి పురుషుడు వెళ్లలేకపోతాడు. కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోని నలుడిలోకి ప్రవేశించగలుగుతాడు కలి.
ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు. మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలన్నీ కోల్పోతాడు. భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపిం చుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్దరినీ పుట్టింటికి పం పించి వేస్తుంది. రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయం తులిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు. ఆకలిదప్పులతో బాధపడు తుంటారు. ఓరోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్లి పోతాయి. తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలు డు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.

- Advertisement -

ఒకసారి ‘నల మహారాజా! రక్షించు!’ అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహా సర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నల మహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు. ‘నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందు కు’ అంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహా రాజును ఆశ్రయించు. నీకు అవసరం అయినప్పుడు నన్ను తల్చు కుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీనిజరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు.
నలుడు బాహుకుడనే పేరుతో రుతుపర్ణ మహారాజు దగ్గర వంట వాడిగా చేరుతాడు. అశ్వ హృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు. ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు. అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత తన దగ్గర పెట్టుకుంటుంది.
నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగులకు దమ యంతి జాడతెలుస్తుంది. దమయంతి తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆమె కొంతమంది బ్రాహ్మణులను అన్ని రాజ్యాలకు పంపిస్తుం ది. ‘అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమా యకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడు న్నాడా?’ అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది. అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకో కుండా నిందించవచ్చా?’ అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు. ఇది తెలిసిన దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వా నమంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరు తుంది. రుతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు. దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చునంటాడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు. దాని మహిమ వల్ల కలిపురుషుడు, చెడు లక్షణాలూ ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు. నేనిక నీ జోలికి ఎప్పుడూ రానంటాడు. మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్లి వేస్తుంది. అది ధర్మం కాదు గానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు. నలుడు కర్కోటకుడిని తలచు కుంటాడు. దివ్యవస్త్రం వస్తుంది. అది ధరించగానే విషప్రభావం నశించి, కురూపి రూపం పోయి, నలమహారాజులా మారిపోతాడు. అప్పుడు కలి వచ్చి, రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య, గద్య రూపేణా విన్నా, పాడినా, తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు

కలి నుండి ఎలా తప్పించుకోగలం?
కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగంలో ధర్మ అడు గంటి ఉంటుంది కావున ఎవరికైనా చిన్న సాయం చేసిన కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. మనస్ఫూర్తిగా రోజుకు ఒక్కసారై నా దైవ స్మరణ చేసిన చాలు కలి నుండి మనం కొంత తప్పించుకుం టాం. దాన ధర్మాలు చేయడం. పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం. కాశీకి వెళ్లినట్టు మనసు లో తలచుకొన్న చాలు కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.
నిత్యం ఒక్కసారైనా క్రింది పద్యాన్ని స్మరిస్తే కలి భయం ఉండదు.
”కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్షేహ కీర్తనం కలి నాశనం!
లిదమయంతి నలాబ్యాంచ ప్రణమామి
పున: పునహా”

  • డా. చదలవాడ హరిబాబు
    9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement