Thursday, May 16, 2024

దురాశ దు:ఖానికి చేటు!

ప్రపంచ ప్రసిద్ధి వహంచిన కైకయ రాజ్యమును సత్యకేతుడు అను రాజు పాలించు చుండెను. అతడు ధర్మాత్ముడు, తేజస్వి, పరాక్రమవంతుడు, సుశీలుడు, బలశా లి. అతనికి ఇద్దరు పుత్రులు కలరు. వారు కూడా యోధులు, సద్గుణ సంపన్నులు. వారిలో జ్యేష్టుడైన ప్రతాప భానుడు రాజ్యమునకు ఉత్తరాధికారి. రెండవవాడైన అరిమర్దనుడు మహాబలశాలి. సంగ్రామ రంగంలో తొణకని వీరుడు. వారి ఐకమత్యము నిరుపమానము, నిష్కళంకము. రాజు జ్యేష్ఠకుమారునకు రాజ్యభారమును అప్పగించి, శ్రీహరి ధ్యానమునకై వనములకు వెళ్లెను.
ప్రతాపభానుడు, అతని సోదరుడైన అరిమర్దనుడు, నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు అయి న మంత్రి ధర్మరుచి సహాయంతో తన దిగ్విజయ యాత్రలో సప్తద్వీపాలనూ జయించి, సమస్త భూమండలానికీ ఏకైక చక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావము వలన, ఆ రాజు గురువులనూ, దేవతలనూ, సాధు సజ్జనులనూ, భక్తితో సేవిస్తూ, రాజధర్మా లను వేదోక్తంగా పాటిస్తూ, ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. వనాలలో ఆశ్రమాలను నిర్మించుకున్న మహర్షులు, తమ తపశ్శక్తిలో ఆరవ భాగం రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటారు. అందుకే, లోకహతులైన మహర్షులను క్రూర మృగాల నుండి కాపాడటం, రాజుల విధి.
ఒకసారి ప్రతాప భానుడు, శాస్త్ర ప్రకారం చంపదగిన మృగాలను వేటాడటానికి, విం ధ్యారణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఒక పెద్ద అడవి పందిని చూసి, దాని వెంటబడ్డాడు రాజు. ఎంత ప్రయత్నించినా, ఆ అడవి పంది అతనికి చిక్కకుండా చాలా దూరం పరుగెత్తి, ఆ ఘనారణ్యంలో ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళడానికి వీలులేక, నిరాశతో ప్రతా పభానుడు వెనుకకు మరలాడు. కానీ, ఆ ఘోరారణ్యంలో దారితప్పి, అలసిపోయి, సొమ్మ సిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కను గొన్నాడు. ఆ ఆశ్రమం ఒక కపట సన్యాసిది. ఆ కపట వేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధంలో ఓడిపోయి, పారిపోయిన శత్రురాజు. ప్రతాపభానునిపై ద్వేషాన్ని నింపుకుని, ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే గుర్తుపట్టాడు. కానీ, అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు, వాడిని గుర్తించలేదు. దాహంతో బాధపడుతున్న రాజుకు, ఒక సరోవరం చూపించాడు. అతడు సరోవరంలో స్నానం చేసి, శుచిఅయ్యి, నీరుత్రాగాడు. ప్రతాపభాను డుని ఆశ్రమంలోకి ఆహ్వానించాడు ఆ కుహనా సన్యాసి.
”నాయనా! నీవెవరు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరారణ్యంలోకి ఎందుకు వచ్చావు?” అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు కపట సన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడు జాగ్ర త్తగా సమాధానమిచ్చాడు. ”ఓ మహాత్మా! నేను ప్రతాపభానుడు మంత్రిని. వేటకై వచ్చి తప్పి పోయాను. మీ దర్శన భాగ్యం కలగటం నా అదృష్టము” అందుకా కపట సన్యాసి, ”ఓ సజ్జను డా! బాగా చీకటిపడింది. నీ రాజ్యం ఇక్కడికి డెబ్భై యోజనాలుంటుంది. కాబట్టి, నీవు ఈ రాత్రికి నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని, రేపు వెళ్ళు” అని చెప్పాడు. సన్యాసి దయాగుణా న్ని పొగడి, ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు. మాయమాటలతో రాజు తనను నమ్మేలా చేసి, ఆ కపట సన్యాసి ప్రతాపభానుడికి, తన వృత్తాంతాన్ని ఇలా చెప్ప సాగాడు. ”నేనిక్కడ చాలాకాలంగా ఉంటున్నాను. ఇంతవరకూ నాదగ్గరకు ఎవరూ రాలే దు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోక ప్రతిష్ఠ తపస్సును దగ్ధం చేసే అగ్నివంటిది కదా! అందుకే ప్రపంచానికి దూరంగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప, నాకింకెవ్వరితోనూ పనిలేదు.” వైరాగ్య బుద్ధి కలిగి, శ్రీహరి భక్తుడని తెలియగానే, ప్రతాపభానుడికి ఆ కపట ధ్యా ని మీద గౌరవం పెరిగింది.
ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడయ్యాడని తెలుసుకుని, ”పుత్రా! నా పేరు ఏకతను డు. సృష్టి ప్రారంభంలో నేను జన్మించాను. తరువాత మరొక దేహం దాల్చలేదు. అందుకే నన్ను ఏకతనుడంటారు.” ఆశ్చర్యంగా వింటున్న ప్రతాపభానుడికి, కపట సన్యాసి ప్రాచీన గాథలూ, పురాణతిహాసాలెన్నో చెప్పాడు. ఇవన్నీ విని పరవశుడైన రాజు, ”స్వామీ! నేను ప్రతాపభానుడను” అని వాస్తవాన్ని చెప్పాడు. ”రాజా! గురుకృప వల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతిని మెచ్చుకుంటున్నాను. తెలియనివాడికి వివరాలు చెబితే, రాజ్యానికే అపాయమని తెలిసి, నువ్వు నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపట సన్యాసి. సద్గుణ సంపన్నుడైన ప్రతాపభా నుడు, దురాశతో ఇలా కోరాడు. ”ఓ దయాసాగరా! నా శరీరం జరామరణ దు:ఖరహతమ వ్వాలి. యుద్ధంలో నన్నెవరూ జయించకూడదు. భూమిపై నూరు కల్పములు నా ఏకచ్ఛత్రా ధిపత్యం నిలిచి ఉండాలి”. ధర్మరుచి ప్రభావం వలన, తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి, ”సర్వం కృష్ణార్ప ణమ్‌” అని భావించే ప్రతాపభానుడు, ఆ సూక్తిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోయా డు. రాజు ఎదుట ఉన్నది నిజమైన సన్యాసి అయితే, ఆ కోరిక విని, ”ఈ శరీరము శాశ్వతము కాదు. ఎందుకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము. శ్రీహరిని శరణు వేడు” అని హతవు చెప్పేవాడు. కానీ, కపటి అవ్వడంచేత ఆ సన్యాసి, ”తథాస్తు. నిన్ను సర్వ ప్రాణుల నుండీ కాపాడతాను. యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ, ఒక్క విప్ర శాపం నుండి మాత్రం నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు.
”గురోత్తమా! విప్రులను ప్రసన్నం చేసుకునే ఉపాయము చెప్పండి” అని ప్రార్థించాడు.
”సరే, కానీ, నీవీ విషయము రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే, నీకు దు:ఖాలు కలుగుతాయి. నీ మంచికోరి చెపుతున్నాను. మూడవకంటికి ఈ విషయం తెలిసిందా, నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.
”గురువర్యా! త్రిమూర్తులు కోపగించినా, గురువు రక్షిస్తాడు. కానీ, గురువే కోపగిస్తే, ఇక రక్షించేవారెవరూ ఉండరు. మీ ఆజ్ఞను అతిక్రమించను, శిరసావహస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. అప్పుడు ఆ కపట ధ్యాని, ”విప్రులను స్వాధీనపరచుకోవటానికి అనేక మా ర్గాలున్నాయి. ఒక సంవత్సరం పాటు, ప్రతిరోజూ లక్షమంది ఉత్తములైన విప్రులను కుటుం బ సహతంగా ఆహ్వానించు. నేను నా తపశ్శక్తితో మీ పురోహతుని వేషము దాల్చి, వారికి భోజ నం వండి పెడతాను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తితో నిన్ను నీ అంత: పురానికి చేరుస్తాను. సరిగ్గా మూడురోజుల తరువాత నీ పురోహతుని రూపంలో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లూ చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి, బాగా అలసిపోయి ఉన్నందువలన, గాఢనిద్రపోయాడు. ఇంతలో కపట సన్యాసి స్నేహతుడైన కాలకేతుడనే రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహ వేషముదాల్చి, ప్రతాపభానుని దారి మరల్చాడు. స్త్రీల నూ, సజ్జనులనూ, దేవతలనూ హంసిస్తున్న కాలకేతుడి నూర్గురు కుమారులనూ, పదిమం ది సోదరులనూ యుద్ధంలో చంపి, దుష్టసంహారం చేశాడు ప్రతాపభానుడు. అది మనస్సు లో పెట్టుకుని, అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు.
కాలకేతుడు తన మాయతో ప్రతాపభానుని అంత:పురానికి చేర్చి, పురోహతుణ్ణి ఒక గుహలో బంధించి, తానే పురోహతునిగా కామరూపం ధరించాడు. తరువాత రోజు ప్రతాప భానుడు నిద్రమేల్కొని, తాను అంత:పురంలో ఉన్న విషయం గ్రహంచి, ఆ కపట సన్యాసి శక్తికి ఆశ్చర్యపోయాడు. మూడు రోజులు క్షణమొక యుగంగా గడిపాడు. శ్రీహరి ధ్యానం వదిలి, ప్రతిక్షణం ఆ కుహనా సన్యాసి పాదాలనే ధ్యానించసాగాడు. అనుకున్న ప్రకారం, లక్ష మంది ఉత్తమ విప్రులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనా పురోహతుడు తన మాయ చేత, లెక్కలేనన్ని వ్యంజనములూ, నాలుగు రకాలైన వంటలనూ, పాక శాస్త్రాన్ని అనుసరించి, షడ్రసోపేతంగా సిద్ధంచేశాడు. కానీ, వాటిలో అనేక జంతువుల మాంసము, బ్రాహ్మణుల మాంసము కలిపి వడ్డించాడు. భోజనానికి విప్రులు సిద్ధమవుతుండగా, కాలకే తుడు ఆకాశవాణిని సృష్టించి, ”ఓ విప్రోత్తములారా! ఈ భోజనం హానికరము. దీనిలో జం తు, విప్ర మాంసమున్నది. దీనిని భుజించవద్దు” అని పలికించాడు. ఆకాశవాణి మాటలు విన గానే, ఆ లక్షమంది విప్రులూ, ”ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భ్రష్టులను చేయదలచావు. నీవు కుటుంబ సహతంగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరంలో నీవు నీ వంశంతో సహా నశిస్తావు. మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోర శాపా న్నిచ్చారు. తమ యుక్తి సఫలమైనదని, కాలకేతుడూ, కపట సన్యాసీ సంతోషించారు. కపట సన్యాసి శత్రురాజులందరినీ కూడబెట్టుకుని, ప్రతాపభానునిపై దండెత్తి వచ్చాడు. వీరుడైన రాజూ, అతని సోదరుడు అరిమర్దనుడూ, చాలాకాలం వారితో యుద్ధం చేశారు. చివరికి వం శముతోసహా ప్రతాపభానుడు నశించాడు. ఆతరువాత, వారంతా రాక్షసులై జన్మించారు.
కొన్ని గ్రంథాల ప్రకారం ఈ ప్రతాపభానుడే రావణునిగా, అరిమర్దనుడే కుంభకర్ణుని గా, ధర్మరుచే విభీషణునిగా జన్మించినట్లు ఉంది. ప్రతాపభానుని జీవితం సూచించే విష యం, మానవుడికి ఆశ ఉండవచ్చు కానీ, దురాశ పనికిరాదు. ”అతిసర్వత్ర వర్జయేత్‌” అంటే ఏ విషయంలోనూ అతి ఉండకూడదని అర్ధం. సమస్త భూమండలానికీ ఏకచ్ఛత్రాధిపతి అయి కూడా, ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరం కోరి, చివరకు నాశనమ య్యాడు. మన శాస్త్రాలలో గురువును ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి, ఉత్త ముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు దురాశ వలన, శత్రువులైన కాల కేతు, కపట సన్యాసులను గమనించక, వారిచేత మోసగించబడినాడు. దురాశ రాజు కళ్ళను మూసివేసింది అని తులసీదాసు రామచరితమానసలో వివరించారు. దురాశ దు:ఖానికి చేటనే నానుడి, ఎన్ని యుగాలకైనా ప్రతిఒక్కరి జీవితానికీముఖ్య ధర్మసూత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement