Thursday, May 16, 2024

వైభవంగాపౌర్ణమి గరుడ సేవ

తిరుమల ప్రభ న్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ వారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవం గా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గటంల నడుమ సర్వాలం కార భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు గరుడు ని పై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శన మిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండడంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం -పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలి యచెబుతారు. అంతే కాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరిం చే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement