Friday, April 26, 2024

108 దివ్య దివ్య‌దేశాల శాంతి క‌ల్యాణానికి అంద‌రూ ఆహ్వానితులే : చిన జీయ‌ర్ స్వామి

ముచ్చింతల శ్రీరామనగరం: రేపు అనగా శనివారం జరగబోయే 108 దివ్య దివ్యదేశాల శాంతి కల్యాణానికి అందరూ ఆహ్వానితులే అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ రామానుజ స్వామి తెలిపారు. తనకు సీఎం కేసీఆర్ కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని శ్రీశ్రీ శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామిజీ స్పష్టం చేశారు. రేపు శనివారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు జరిగే 108 దివ్యదేశాల శాంతి కళ్యాణోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. పూర్ణాహుతి అనంతరం సాయంత్రం కళ్యాణం ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించినా… 108 దివ్య దేశాల పెరుమాళ్ళ కు ఒకేసారి శాంతి కళ్యాణం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం తీసుకున్నట్లు శ్రీ శ్రీశ్రీ త్రిదండి చిన
జీయర్ స్వామీజీ తెలిపారు. రేపు సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య జరిగే ఈ కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు, అతిధులు అందరూ హాజరు కావాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వం యొక్క సహకారం ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. సమతా మూర్తి విగ్రహ దర్శనంతో పాటు 108 దివ్య దేశాల ఆలయాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని.. ఈ నెల 20 నుంచి సువర్ణమూర్తి విగ్రహాన్ని దర్శనానికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. శ్రీ రామానుజ సువర్ణ మూర్తి దర్శనంతో పాటు 108 దివ్యదేశాలలో నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, 3డి టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా సందర్శకులకు మరింత సౌలభ్యం లభిస్తుందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వారి ఆదేశాల పాటించాలని సీఎం కేసీఆర్ చెప్పారని అంతేకానీ సీఎం కేసీఆర్ తో తనకు కు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. శిలాఫలకం ఏర్పాటు విషయంలో ఈ విభేదాలు అన్ని మీడియా సృష్టేనని. సీఎం కేసీఆర్ కు తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిన్న జీయర్ స్వామి తెలిపారు . ముచ్చింతల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తానే మొదటి వాలింటర్ నని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని చిన జీయర్ స్వామి మీడియాకు గుర్తు చేశారు. ఎంట్రీ ఫీజు విషయంలో త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. సమతా మూర్తి స్పూర్తిని అందరూ పాటించాలని సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ తొలగిపోవాలని ఆయన అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం మహా అద్భుతం అని ఇది యాగ ఫలమే అని చిన్న జీయర్ స్వామి తెలిపారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంలో మీడియా సహకారం అందించిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement