Saturday, April 27, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఉద‌యం నుంచి క్యూలైన్లు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంద‌ని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. టోకెన్ లేని భక్తులకు 14 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 76,736 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,132 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement