Friday, April 26, 2024

శ్రీవారి పేరిట ఇత‌ర సంస్థ‌ల వ‌సూళ్లు.. భ‌క్తుల‌ను మోస‌పోవ‌ద్ద‌న్న అధికారులు

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమలలో ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ‘టీటీడీ ఉచితంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనుంది. అన్నదానం పేరిట ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వవద్దని టీటీడీ ఈ మేర‌కు భక్తులకు విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్‌కు చెందిన అనంత గోవిందదాస ట్రస్టు భక్తుల నుంచి విరాళాలు కోరడాన్ని టీటీడీ గుర్తించిన‌ట్టు తెలిపింది.

ఇందుకోసం బ్యాంక్‌ అకౌంట్ నెంబరును కూడా సదసు ట్రస్టు అందుబాటులో ఉంచింద‌ని, ఈ ట్రస్టుతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి సంస్థలు, వ్యక్తుల మాటలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్టుల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement