Friday, May 17, 2024

భక్తులను ఎల్లవేళలా కాపాడే సాయి!

బోర్కర్‌ అనే మహిళ 1909వ సంవత్సరంలో శిరిడీలో కొంత కాలం నివసించడానికి వెళ్ళింది. ఆ సమ యంలో ఆమె భర్త భూలోక వైకుంఠమైన పండరీపూరులో ఉద్యోగం చేస్తుండేవాడు. ఒకరోజు మశీదులో కూర్చొని వుండగా సాయిబాబా చంద్రాబాయితో ”అమ్మా! నువ్వు అర్జంటుగా పండరి వెళ్ళు, నేను నీకు తోడు గా వుంటాను, నాకు ఏ రైలు అవసరంలేదు” అని అన్నారు. బాబా మాటలను బట్టి తన భర్తకు ఏదో ప్రమాదం సంభవించి వుండవచ్చని భావించిన చంద్రాబాయి హుటాహుటిన బయలుదేరి పండరి వెళ్ళింది. అక్కడ చిత్రంగా ఆమె భర్త తాను చేస్తున్న ఉద్యోగం వదిలే సి, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఆచూకి గురించి ఎంతమందితో వాకబు చేసినా ఏమీ ప్రయో జనం లేకపోయింది. ఇక దిక్కుతోచక ఆమె తన వద్ద వున్న మిగిలిన డబ్బుతో కురుద్వాడి వద్దకు చేరుకొని స్టేషనులో బెంచీ పై కూర్చుంది. తన ఆరాధ్య దైవమైన శ్రీ సాయే తన కు ఒక మార్గం చూపిస్తారన్న దృఢమైన విశ్వాసంతో సాయి నామ జపం చేస్తూ అక్కడే కూర్చుంది. ఇంతలో ఒ క ఫకీరు వచ్చి ”వెంటనే ఇప్పుడు వచ్చే రైలు ఎక్కి ధోండ్‌ స్టేషనుకు వెళ్ళు, అక్కడ మీవారు వున్నారు” అని చెప్పి ఆమె చేతిలో ఒక రైల్వే టిక్కెట్టును పెట్టి వెళ్ళిపోయాడు. చంద్రాబాయి ఆనందంతో ఆ ఫకీరు చెప్పినట్లే చేయగా ధోండ్‌ స్టేషనులో ట్రెయిను దిగగా అక్కడ ప్లాట్‌ఫారముపై కునికిపాట్లు పడు తున్న ఆమె భర్త కనిపించాడు. ఆయన తన భార్యను దగ్గర గా తీసుకొని క్షమించమని అడిగి- ”నేను మనస్సు బాగు లేక ఎక్కడికో దూరంగా పారిపోదామనుకున్నాను. కాని ఒక ఫకీరు వచ్చి నా తల్లిని అశ్రద్ధ చేయవద్దు. ఆమె ఇప్పుడు రైల్లో వస్తుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకో అని మందలించి మాయమైపోయాడు.” అని అన్నారు. జరిగినదంతా శ్రీ సాయినాథుని లీలేనని, శ్రద్ధ, విశ్వాసంతో పూజి స్తే తన భక్తులను ఎల్లవేళలా కాపాడతారని ఆ దంపతులిద్దరికీ మరొకసారి అవగతమయ్యింది.
మరొకసారి శ్రీ సాయినాథులు చంద్రాబాయి కలలో కనిపించి ”నీ భర్తను తీసుకుపోతున్నాను. ధైర్యంగా వుండు” అని చెప్పారు. అప్పుడు చంద్రాబాయి కలలో కన్నీళ్ళతో బాబా పాదాలపై పడి ”ఈ చాతుర్మాస్యం వెళ్ళే వరకు ఆయన ప్రాణాలు నిలపమని కోరింది. సరేనన్నారు బాబా. చాతుర్మాస్యంలో ఆమె భర్తకు ప్రమాదకరమై న జబ్బు చేసింది. డాక్టర్లందరూ ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఇక కొద్దిరోజుల కంటే ఎక్కువగా బ్రత కరని తేల్చి చెప్పేసారు. కాని చంద్రాబాయికి బాబాపై అమితమైన విశ్వాసం వుంది. డాక్టర్ల మాటలను పట్టించు కోలేదు. బాబా ఆశీర్వదించినట్లే చాతుర్మాస్యం గడిచింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు, డాక్టర్లు ఇక ఆయన ప్రాణానికి ఏ ప్రమాదంలేదని చెప్పారు. ఒక రోజున ఆమె భర్త విష్ణుసహస్ర నామము చదివించు కొని, టీ త్రాగి కళ్ళు తేలేసారు. బాబా చెప్పినది గుర్తొచ్చి ఆమె ఆయన గొంతులో గంగ వేసింది. ‘సాయి నాథా’ అంటూ ఆమె భర్త హాయిగా కళ్ళు మూసారు. తన భక్తురాలి నిష్కలంకమైన ప్రేమకు కరిగిపోయి, ఆమె భర్త మరణాన్ని కూడా పోస్ట్‌ పోన్‌ చేసిన శ్రీ సాయినాథుని లీలలను వర్ణింప శక్యమా?

Advertisement

తాజా వార్తలు

Advertisement