Sunday, May 12, 2024

రెండు నాణేలు

అది ద్వాపరయుగం. ఓసారి కృష్ణార్జునులకు ఓ పేద బ్రాహ్మ ణుడు కనిపించాడు. జాలిపడిన అర్జునుడు అతనికి ఓ సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకు వెళు తున్న ఆ బ్రాహ్మణుణ్ని మార్గమధ్యంలో ఓ దొంగ దోచుకున్నాడు. గతిలేక అతడు మళ్లీ వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. ఓ రోజు అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ వజ్రం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లా డు. గదిలో మూలన ఉన్న కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లా రింది. చూస్తే భార్య లేదు. ఆ కుండా లేదు. పరుగెత్తుకుంటూ నదీ తీరం దగ్గరికి వెళ్లాడు.భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హ మ్మయ్య అనుకున్నాడు. కానీ కుండలో వజ్రం లేదు. నదిలో నీళ్లకు కుండ వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దుర దృష్టానికి చింతించి మళ్లీ యాచకుడిగా వెళ్లాడు. మళ్లీ కృష్ణార్జును లు అతణ్ని విచారించారు. ”ఇక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు” అన్నాడు అర్జునుడు. ”లేదు అర్జునా. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం” అం టూ బ్రాహ్మణుడికి రెండు బంగారు నాణేలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు.
‘సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తా యా…’ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారి లో ఓ జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. ”ఈ రెండు నాణేలు ఎలాగూ నా తలరాత ను మార్చలేవు. పాపం మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం” అనుకుని నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ చేపను ఓ నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసింది. ”అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండీ” అంటూ భర్తని పిలి చింది. గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. అది నదిలో వాళ్లు జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై ”దొరికింది… దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన దొంగ కంగారుపడ్డా డు. ”గతంలో ఈ బ్రాహ్మణుడినుంచే బంగారు నాణేల సంచి దొం గిలించా, ఇప్పుడు అతను నన్ను గుర్తుపట్టినట్టు-న్నాడు. అందుకే నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు” అనుకుని వణికిపోయా డు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ”నీ బంగారు నాణేలు నువ్వే తీసే సుకో. నన్ను మాత్రం రక్షకభటు-లకు పట్టివ్వద్దు” అని ప్రాధేయ పడ్డాడు. దంపతులు నివ్వెరపోయారు. పోగొట్టు-కున్న రెండూ తిరి గి వచ్చాయి. పరుగు పరుగున కృష్ణార్జునుల దగ్గరికి వెళ్లి కృతజ్ఞత లు చెప్పాడు. ”కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నువ్విచ్చిన రెండు నాణేలూ అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది” అని ప్రశ్నించాడు అర్జునుడు. ”అర్జునా, తన దగ్గర బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి ఈతిబాధలు, కష్టసుఖా ల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అత ని కష్టాన్ని నేను పంచుకున్నాను” అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.
సేకరణ: పి.భాస్కరశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement