Monday, April 29, 2024

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ , గవర్నర్‌ సతీమణి సుప్రవ హరిచందన్‌ విజయ వాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి(దుర్గగుడి) వారి ఆలయాన్ని సందర్శించుకుని శ్రీ కనక దుర్గా అమ్మవారి దర్శనం చేసుకున్నా రు. గవర్నర్‌ దంపతులు శ్రీ స్వర్ణ కవచా లంకృత రూపంలోని శ్రీ దుర్గాదేవి అమ్మవారికి చేసిన తొలి పూజలో పాల్గొన్నారు. గురువారం ఉదయం దేవస్ధానానికి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు దేవాదాయ శాఖ గౌరవ మర్యాదలతో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, శాసన సభ్యుడు మల్లాది
విష్ణు, దేవస్ధానం ఛైర్మన్‌ పైలా సోమి నాయుడు, కార్యనిర్వహణ అధికారి డి. భ్రమ రాంబ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిచందన్‌ మాట్లాడుతూ నవరా త్రుల్లో శ్రీకనకదుర్గమ్మ దర్శనం పొందడం తన అదృష్టం అన్నారు. తమ కుటు-ం బంలో కూడా దసరాను అన్ని సంప్రదాయాలతో పాటిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆశీర్వదించాలని, రాష్ట్రం, దేశం శుభిక్షంగా ఉండాలని తాను దుర్గా మాతను ప్రార్థించానన్నారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కొంటు-ందని, అమ్మవారు మొత్తం మానవాళిని ఈ గం డం నుండి బయటకు తీసుకురావాలని ఆశిస్తున్నానని హరిచందన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement