Wednesday, May 15, 2024

తిరుమలలో సౌకర్యాలు భేష్‌

అండమాన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దేవేం ద్రకుమార్‌
తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, భక్తుల సౌకర్యాలు, ఏర్పాటు చేసిన క్యూలు బాగున్నాయని అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దేవేం ద్రకుమార్‌ జోషి అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా టిటి డి అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలు పల ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమలలో ఏర్పాటు చేసిన నిర్మాణాలు, క్యూలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. దేశంలోని మరే దేవాలయులోనూ తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు లేవని ఆయన కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement