Wednesday, May 8, 2024

తార మాట వింటే.. వాలి బతికేవాడేనా?

తన అన్న వాలిని శ్రీరాముడు చంపుతాడన్న నమ్మకం కుది రింది సుగ్రీవుడికి. ఆ వెంటనే సుగ్రీవుడితో రాముడు, కిష్కింధకు వెళదామనీ, ఉపేక్ష చేయవద్దనీ, సోదరుడిని యుద్ధా నికి పిలువమనీ, భయపడవద్దనీ అంటాడు. రాముడు చెప్పినట్లు గానే సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేట్లు సింహ నాదం చేసి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ ధ్వని విన్న వాలి మండి పడుతూ యుద్ధానికి వచ్చాడు. వారిరువురికీ ఆకాశంలోని బుధ, అంగారక గ్రహాలకులాగా ఘోరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. అప్పుడు రామచం ద్రమూర్తి గురిచూసి వాలి మీద బాణం వేద్దా మనుకున్నాడు కాని, ఆకారంలో సమానంగా ఒకేవిధంగా వున్న వారిద్దరినీ చూసి ఎవరు సుగ్రీవుడో, ఎవరు వాలో పోల్చుకోలేక సందేహంతో రామచంద్రమూర్తి బాణాన్ని విడవలేదు. ఇంతలో వాలి దెబ్బలకు బాధపడిన సుగ్రీవుడు అన్న తరుముతుంటే ఋష్య మూకానికి వెళ్ళిపోయాడు.
రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు సిగ్గుతో తలవంచుకుని ”నీ పరాక్రమాన్ని నేను నమ్మేట్లు చేసి చూపించి, నన్ను యుద్ధానికి పొమ్మని ప్రేరేపించి, శత్రువు చేతి లో నన్నిలా చంపేట్లు చేయడానికి కారణం ఏమిటి? నా శత్రువు చేతిలో నన్ను చంపించడంవల్ల నీకు కలిగే లాభం ఏంటి రామచంద్రా? బలవంతుడా! మహాబుద్ధిమం తుడా! వాలిని చంపమని నిన్ను నేను కోరినప్పుడు చంపనని ముం దే చెప్పవచ్చు కదా? నువ్వు అలా చెప్తే నేను ఎప్పటిలాగా హాయిగా ఇక్కడే పడి వుండేవాడిని కదా? నన్నెందుకు యుద్ధానికి పంపావు? నన్ను చావుదెబ్బల పాలు చేయడానికా?” అంటూ ఏడుస్తున్న సుగ్రీవుడిని చూసి రాముడు ”నా దివ్యబాణాన్ని విడవకపోవడా నికి కారణం చెప్తా విను. రూపంలో, వయస్సులో, ఎత్తులో, చూడడానికి, వేషంలో, నడకలో, కాంతిలో, మాటల్లో, కంఠ స్వరంలో, ధైర్యంలో, మీరిద్దరూ సమానంగా వున్నారు. ఈ కార ణాన మీలో వాలి ఎవరో, సుగ్రీవుడు ఎవరో నేను గుర్తుపట్టలేక ప్రాణం తీసే బాణాన్ని వదల లేదు. ఇది ముమ్మాటికీ నిజం. నా బాణం నిన్ను చంపితే, నా బుద్ధి లేనితనం శాశ్వతంగా నిలిచి వుండేది కదా? కార్యభంగమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి వచ్చేది. నేను, లక్ష్మణుడు, సీత నీకు వశపడి వున్నాం. మా క్షేమం నీ చేతిలో వుంది. కాబట్టి నీకు ద్రోహం చేయ ను. నా మాట నమ్ము. సందేహంచవద్దు. మళ్లి వాలి మీదకు యుద్ధానికి వెళ్లు. నాకు తెలిసేవిధంగా నువ్వేదైనా గుర్తు ధరించు. అప్పుడు నా బాణం దెబ్బకు వాలి చస్తాడు” అన్నాడు.
రాముడు లక్ష్మణుడితో ”లక్ష్మణా! గజపుష్పమాల తీగె పుష్క లంగా వుంది. అది స్పష్ఠంగా తెలిసేట్లు తెచ్చి సుగ్రీవుడి మెడలో వేయి” అన్నాడు. వెంటనే లక్ష్మణుడు దాన్ని తెచ్చి సుగ్రీవుడి మెడ లో వేశాడు.
ముందు లక్ష్మణుడు, వెనుక హనుమంతుడు రాగా రాముడు బంగారు రేకులతో అలంకరించిన పెద్ద విల్లు, సూర్యకాంతిగల బాణాలను ధరించి బయల్దేరాడు. వాలిని సంహరించాలన్న ఆసక్తి తో వున్న శ్రీరాముడు వాలి పాలించే కిష్కింధను చూశాడు. ఈవిధం గా అందరూ వాలి పాలించే నగరానికి సమీపంలో దట్టమైన అరణ్య ప్రదేశంలో చెట్ల గుంపులున్న ఒక మరుగైన స్థలంలో నిలబడ్డారు. ఎలాంటి సింహనాదం నువ్వు చేస్తే, కోపంతో మండిపడుతూ, వాలి యుద్ధానికి వస్తాడో, అలాంటి సిం#హనాదం చేయమని చెబుతాడు రాముడు. సుగ్రీవుడు, ఉరుములాగా గర్జిస్తూ, కంఠ ధ్వనిని దిక్కు లు పిక్కటిల్లేట్లు చేశాడు. గుండెలు పగిలేలా సుగ్రీవుడు చేసిన సింహనాదాన్ని, కంఠధ్వనిని విన్న వానరులు దిక్కుతోచక పరుగె త్తారు. ఉరుములా సుగ్రీవుడి కంఠధ్వని క్షణక్షణం పెరగసాగింది.
సుగ్రీవుడి సిం#హనాదం అంత:పురంలో వున్న వాలి వినగానే అతడి మదం అణగిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో వాలి గ్ర#హణం పట్టిన సూర్యుడిలాగా హనుడయ్యాడు. కోపాతిశయంతో మండుతున్న అగ్నిలాగా వెలుగుతూనే కాంతి#హ నుడయ్యాడు. సుగ్రీవుడి కంఠధ్వని చెవుల్లో పడగానే, పటపటా పండ్లు కొరికి, సుగ్రీవుడి మీదకు యుద్ధానికి పోవడానికి సన్నద్ధమ య్యాడు. ఆ సమయంలో వాలి భార్య తార ఆయనను అడ్డుకుని ఆయనకు మేలు జరిగే మాటలను తొట్రుపాటుతో ఇలా చెప్పింది.
”ఈ కోపాన్ని వదిలిపెట్టు. సూర్యోదయం కాగానే నువ్వు యుద్ధానికి వెళ్లు. ఇప్పుడే పోకపోతే నీకు వచ్చే అవమానం కానీ, నీ విరోధికి కలిగే గౌరవం కానీ ఏమీ లేదు. ఆలోచించు. ఇప్పుడే వెళితే వచ్చే నష్టం ఏంటి? అంటావా? ఇంతకు కొద్దిసేపటి క్రితమే నీ భుజ బలం ముందు సతమతమై, బల#హనుడై పరుగెత్తిపోయాడు. ఇం తలోనే మళ్లిd యుద్ధానికి నిన్ను పిలిచే ధైర్యం, సాహసం ఎక్కడి నుం డి వచ్చింది? కాబట్టి నాకు ఏదో సందే#హం కలుగుతు న్నది. అతడు చేస్తున్న సింహనాదం ఇదివరకు చేసినట్లు లేదు. ఇప్పుడు బలమైన యత్నం కనిపిస్తున్నది. ఇలా కావడానికి కారణం ఏదో వుండాలి. కారణం లేకుండా కార్యం వుంటుందా? ఏదో బలిష్టమైన సహా యం దొరక్కుండా ఇలా మళ్లిd యుద్ధానికి రాడు. బలిష్ట సహాయం దొరక్కపోతే అలాంటి సింహనాదం చేయడు. బాగా ఆలోచించి, పరీక్షించి, నిస్సందే#హంగా బలిష్టుడని అనుకున్నవాడితో వస్తాడు కానీ, అల్పులతో రాడు” అని నా అభిప్రాయం.
”ఇంతకుముందే నేనీ వృత్తాంతాన్ని విన్నాను. మన అంగ దుడే నాకీ సంగతి చెప్పాడు. అతడు అరణ్యానికి పోయి మరలి వచ్చేటప్పుడు మన వేగుల వాళ్ళు చెప్పారట. రఘువంశంలో పుట్టి న రామలక్ష్మణులు అనేవాళ్లు, నువ్వు పోలేని ఋష్యమూకంలో నీ తమ్ముడికి సహాయం చేయడానికి వచ్చారట. వాళ్లలో రాముడనే వాడు శత్రువుల పాలిటి కాలాంతకుడు. ప్రళయకాలాగ్నిలాంటి వాడు. ఉచితానుచిత విద్యల్లో సమర్థుడు. సుగ్రీవుడికి రక్షకుడైన వాడు నీకెందుకు కాకూడదని అంటావా? నిన్నెందుకు శిక్షిస్తాడం టావా? సుగ్రీవుడు ఆయన్ను ఆశ్రయించాడు. నువ్వు ఆశ్రయించ లేదు. కాబట్టి నీకు ఆయన రక్షకుడు కాలేడు. అంతేకాదు ఆయన్ను ఆశ్రయించిన సుగ్రీవుడికి నువ్వు విరోధివి. నిన్నెలా రక్షిస్తాడు? సుగ్రీ వుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాడో, అప్పుడే సాధువయ్యాడు. నువ్వు ఆశ్రయిస్తే నిన్నూ రక్షిస్తాడు. సర్వకల్యాణ గుణాలకు రాముడు స్థానం. నేను నీ దోషాలు ఎత్తి చూపడానికి చెప్పడం లేదు. నా మాట విను. నీకు మేలు కలుగుతుంది”.
”రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవడం సరైంది కాదు. అది దోషం. అందుకే, నేను, నాకు తోచిన ఉపాయం చెప్తా విను. ఆ తరువాత నీకేది మంచిదో అదే చేయి. సుగ్రీవుడికి ¸°వరాజ్యం ఇచ్చేయి. అతడూ మహాబలవంతుడే. అతనితో నీకెందుకు విరో ధం? నా మనవి విను. రామచంద్రమూర్తితో స్నేహం చేయడం నీకు శ్రేయస్కరం, శుభకరం. అదెలా కుదురుతుంది అంటావా? నీ తమ్ముడి మీద పగ వదలిపెట్టు. నువ్వాపని చేస్తే రామచంద్రమూర్తి నిన్ను ద్వేషించడు. నీకు సుగ్రీవుడు ఒక్కడే తమ్ముడు. అతను తప్ప నిన్ను అన్నా, అని పిలిచేవాడు ఎవరూ లేరు. దుర్మార్గుడు కాదు. ఉత్తమ గుణాలు కలవాడు. నీమీద వినయ విధేయతలున్నాయే కాని, ధిక్కరించేవాడు కాదు కదా? నీకేమైనా శత్రువా? మీరిద్దరు ఒక్క గర్భంలో పుట్టారు కదా. అతడిని గౌరవించి దగ్గర వుంచుకో. తమ్ముడి విషయంలో ద్రో#హం మానుకో. రామచంద్రమూర్తితో విరోధం వద్దు. శాంతించు” తార ఈ విధంగా ఎంత హతం చెప్పినా వాలి చెవులకు ఎక్కలేదు. కాలం దాపరించినవాడు హతవాక్యాలు వింటాడా? వాలికి కోపం వచ్చింది. అలా చెప్పడం తారకు తగదని ”ఈ విధంగా మాట్లాడడం నీకు న్యాయమా? వాడు నాకు తమ్ము డా? తమ్ముడే అయితే మితిమీరిన గర్వంతో చెలరేగి, సిం#హనాదా లు చేసి నన్ను యుద్ధానికి పిలుస్తాడా? ఇలాంటివాడిని ఎలా క్షమిస్తా ను? శూరులకు ప్రాణాలు తీపి అని అనుకుంటున్నావా? పరాజ యం అంటే ఏమిటో తెలియనివారికి, యుద్ధంలో వెనుకడుగు వేయని, తిరస్కరించబడని వారికి, విరోధులు చేసే అవమానం కంటే చావడమే మేలు. నామీదికి యుద్ధానికి వచ్చినవాడు శూరు డా? సిం#హనాదాలు చేస్తాడా? వాడి రంకెలు విని స#హంచే టంత ఖర్మ నాకెందుకు? ఇక రామచంద్రమూర్తి నన్ను చంపుతా డని కదా భయపడ్తున్నావు? నువ్వు భయపడాల్సిన పనిలేదు. ఆయన నాకపకారం చేయడు. ఎందుకంటే, ఆయన ధర్మం అంటే విశేష ప్రీతికలవాడు. మేలెరిగిన వాడు నిష్కార ణంగా నన్నెందుకు చంపు తాడు? నువ్వు ఇతర స్త్రీలతో అంత:పురానికి వెళ్లు. నామీద నీకున్న భక్తివల్ల ఇంత చెప్పావని నాకు తెలుసు. యుద్ధానికి పోయి శత్రువు ను కొట్టి, నీ మరది భుజబల గర్వం అణచి వస్తాను. వాడిని చంప ను. నామాట నమ్ము. వాడికి బలం లేదు. గొం తు లేదు. అలాం టివాడి సింహనాదాన్ని సహస్తానా? నా ప్రాణం మీద ఒట్టు పెడుతు న్నాను. నా విజయం కాంక్షించి వెళ్లిపో” అని వాలి చెప్పగా నే తార ప్రదక్షిణ చేసి, మంగళా శాసనాలు చెప్పి మిగిలిన స్త్రీలతో అంత:పు రానికి తరలింది. వెంటనే వాలి యుద్ధానికి బయలుదేరాడు.
అధిక రోషంతో వున్న వాలికి సుగ్రీవుడిని చూడగానే ఉత్సాహం కలిగింది. సుగ్రీవుడికి ఎదురుగా వెళ్ళాడు. అలా వస్తున్న వాలిని బంగారు మాలిక ధరించిన సుగ్రీవుడు చూసి అదురు బెదురూ లేకుండా ముందుకుసాగాడు. తనకెదురు గా వస్తున్న తమ్ముడిని చూసి వాలి, తన ముష్టిని చూపిస్తూ, అది అతడిని వజ్రం లాగా భేదిస్తుందన్నాడు. వాలికి సమా ధానంగా తన ముష్టిని చూపాడు సుగ్రీవుడు. వాలి తలను చింత కాయలాగా చేస్తానంటాడు. ఆ మాటలకు కోపించిన వాలి, సుగ్రీవు డిని సమీపించి గట్టి పిడికిలితో కొట్టాడు. ఆ దెబ్బకు శరీరం నుండి నెత్తురుకారుతున్నప్పటికీ, ఒక చెట్టు పీకి గిరగిరా తిప్పి వాలిని కొట్టాడు సుగ్రీవుడు. ఆ దెబ్బకు వాలి గడగడ వణికాడు. వాలి సుగ్రీవులిలా ఒకరినొకరు జయించగల వారిలాగా, భయపడకుం డా యుద్ధరంగంలో ప్రకాశించారు.
వాలి శౌర్యం క్రమంగా పెరగసాగింది. సుగ్రీవుడి బలం క్రమం గా తగ్గసాగింది. అయినా సుగ్రీవుడు యుద్ధం చేస్తూనే వున్నాడు. ఒకరినొకరు ముష్టిఘాతాలతో, చేతులతో, చెట్లతో, కాళ్లతో, గోళ్లతో, ధీరుల్లాగా తమ ఇష్టం వచ్చిన రీతిలో యుద్ధం చేశారు. సుగ్రీవుడి బలం క్రమక్రమంగా క్షీణించింది. వాలితో దెబ్బ లు తిని నలుదిక్కు లా చూడసాగాడు. తన స్నే#హతుడు, తాను అభయహస్తం ఇచ్చిన వాడు, తననే నమ్మినవాడు సుగ్రీవుడు తన కళ్ళ ముందే శత్రువు చేతిలో ప్రాణాం తక బాధపడడం చూసిన శత్రుసంహరణ దక్షుడైన శ్రీరాముడు, వాలిని చంపగల భయంకర బాణాన్ని తీసి అల్లెతాటి లో వేగంగా కూర్చాడు. ఆ అల్లెతాటి శబ్దానికి ఆకాశంలో తిరిగే పక్షులు, నేలమీద తిరిగే మృగాలు భయపడి తమ స్థానాల్లో వుండ లేకపోయాయి. వజ్రాయుధంలాగా, వేగంగా, పిడుగులాగా, రామ చంద్రమూర్తి విల్లు నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకిం ది. ఆ బాణం తాకగానే ఇద్రధ్వజంలాగా బలం క్షీణించి, వాలి నేలకూలాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement