Friday, April 26, 2024

ఖైరాతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

 ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. భక్తులు కుటుంబ సమేతంగా ఖైరతాబాద్‌ వినాయకుడి వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పంచముఖ రుద్ర మహాగణపతి దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement