Saturday, April 20, 2024

హన్మకొండలో షర్మిల నిరాహార దీక్ష

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హన్మకొండలోని హయగ్రీవచారి మైదానం వ‌ద్ద    నిరుద్యోగ నిరాహార దీక్ష‌కు దిగారు. ప‌లువురు నిరుద్యోగులు ఈ దీక్ష‌లో పాల్గొన్నారు. దీక్ష  సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.   అనంతరం ఆమె తెలంగాణ‌లో నిరుద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారు. ష‌ర్మిల దీక్ష‌కు దిగిన సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement