Sunday, May 19, 2024

యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ యాక్షన్‌ చిత్రం.. ఐమాక్స్ లో రిలీజ్‌కు షంషేరా రెడీ..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : సూపర్‌ స్టార్‌ రణబీర్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, వాణి కపూర్‌ నటించిన యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ షంషేరా జూలై 22న ఐమ్యాక్స్‌లో విడుదల కానుంది. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ సినిమా గతంలో ఎన్నడూ చూడని విజువల్‌ మహోత్సవంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేక్షకులకు భారీ స్కీన్ర్‌పై యాక్షన్‌ సన్నివేశాల అనుభవాలను అందించేలా దీన్ని తెరకెక్కించారు. ఐమ్యాక్స్‌లో ఇంతకు ముందు విడుదలైన కొన్ని ఇతర ఆన్‌స్క్రీన్‌ యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ హిందీ సినిమాల్లో ధూమ్‌-3, బాహుబలి-2, పద్మావత్‌ తదితరాలున్నాయి.

ఈసందర్భంగా దర్శకుడు కరణ్‌ మల్హోత్రా మాట్లాడుతూ… మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులు అత్యద్భుత అనుభవాన్ని అందుకునే విధంగా ఒక విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను షంషేరా అందిస్తుందన్నారు. ఈ సినిమాను ఐమ్యాక్స్‌లో విడుదల చేస్తున్నందుకు తాము థ్రిల్‌గా ఉన్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సినిమాలోని దృశ్యాల్లో పూర్తిగా లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుందన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement