Thursday, April 25, 2024

ఇలా ఎందుకు ? విడుదలైన రెండు వారాలకే ఓటీటీ లో !!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నాడు. కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాటి నటిస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక కార్తికేయ బస్తి బాలరాజు గా కనిపించబోతున్నాడు, ఇక లావణ్య కూడా నర్స్ పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటంటే విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటిటిలో విడుదల చేయబోతున్నారట.ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతోంది. అంటే ఏప్రిల్ 2 కి ఆహా లో రిలీజ్ కాబోతుందట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement