Saturday, April 27, 2024

ఆచార్య లో చరణ్ కు బ్యాలెన్స్ ఇదొక్కటే !!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆచార్య. వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

మెగాస్టార్ చేసిన సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కాగా తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పూజాహెగ్డే లకు సంబంధించి ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉందట. ఇప్పటికే నీలాంబరి అనే సాంగ్ ను పూర్తి చేశాడట కొరటాల శివ. ఇప్పుడు మిగిలిఉన్న సాంగ్ ను ఏప్రిల్ 9వ తేదీ నుండి స్టార్ట్ చేయబోతున్నారట.

ఈ పాటను ధర్మస్థలి విలేజ్ సెట్లోనే చిత్రీకరించనున్నారట. ఆ పాట ఒకటి పూర్తి అయిపోతే రామ్ చరణ్ పూజా హెగ్డే కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement