Friday, April 26, 2024

హనుమాన్ లో వరలక్ష్మీ శరత్ కుమార్?

అ,కల్కి , జాంబి రెడ్డి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం హనుమాన్ ను ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. అలాగే ఈ సినిమాలో కూడా జాంబి రెడ్డి హీరో తేజ సజ్జాను హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అలాగే మిగిలిన స్టార్ కాస్ట్ ని వెతికే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తేజ సజ్జా సిస్టర్ పాత్రకి వరలక్ష్మి శరత్ కుమార్ ను సెలెక్ట్ చేసుకున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. ఇక ఇటీవల క్రాక్, నాంది చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement