Thursday, April 25, 2024

పుష్ప అలా ఉండబోతుందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

కాగా అందులో ఒకటి… ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కాగా.. మరొకటి వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని సమాచారం. అంతేకాకుండా బన్నీ డ్యూయల్ రోల్ లో కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement