Friday, May 3, 2024

Tillu swcare : టిల్లు స్వ్కేర్ … వంద కోట్లు గ్యారంటీ..

2022లో విడుదలై విజయం సాధించిన డిజే టిల్లు చిన్న సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ వచ్చింది.. స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ, అను పమ పరమేశ్వరన్‌ జంటగా నటించారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాల తో టిల్లు స్క్వేర్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.

ఈ విజయానందంలో చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మం చి బడ్జెట్‌తో డీజీ టిల్లు చిత్రాన్ని నిర్మాతకు కృతజ్ఞతలు. టిల్లు స్క్వేర్‌ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. అన్నారు.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్‌ చేశాను. అన్నారు.

- Advertisement -

దర్శకుడు మల్లిక్‌ రామ్‌ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. అన్నారు.నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్‌ వస్తోంది. వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు- వసూలు చేస్తుంద నేని నమ్ముతున్నాను. అన్నారు.ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌ శంకర్‌, రవి ఆంథోనీ, ప్రణీత్‌ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement