Sunday, April 28, 2024

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వికి ఆ ముగ్గురే ఫ్రెండ్స్ …

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. తనకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుగా టాలీవుడ్ లో వీరినే సంప్రదిస్తుందని, తనకు అండగా నిలిచేవారు వీరే అంటున్నారు. హీరోయిన్ సాయిపల్లవి తన కెరీర్ లో దుసుకుపోతోంది. ఎలాంటి మచ్చలేకుండా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకుంటోంది. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది.
సాయిపల్లవి క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను అభిమానించే వారంత సాయిపల్లవికి డైహార్ట్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఇక సాయిపల్లవి కూడా వారి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయడం లేదు.

- Advertisement -

అయితే సాయిపల్లవి గురించి ఎప్పుడూ ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకు చెల్లి పూనమ్ కన్నన్ పెళ్లి కావడంతో… సాయి పల్లవి మ్యారేజ్ ఎప్పుడూ అంటూ హాట్ టాపిక్ గ్గా నడించింది.
ఇక తాజాగా ఆమె బెస్ట్ ఫ్రెండ్స్… అందులోనూ టాలీవుడ్ లో ఈ నేచురల్ బ్యూటీ కోసం ఏదైనా చేసే ప్రాణ స్నేహితులు ఉండటం విశేషంగా మారింది. వారి గురించి దాదాపు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. టాలీవుడ్ లో సాయి పల్లవికి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఒకరు అక్కినేని నాగచైతన్య , మరోకరు రానా దగ్గుబాటి కాగా… మరొకరు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కావడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘ఫిదా’, రానాతో ‘విరాటపర్వం’… నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘తండేల్’ మూవీలో నటిస్తున్నది. మొత్తానికి టాలీవుడ్లో వీరి ముగ్గురితో సాయిపల్లవి స్నేహబంధం బలంగా ఉందంట….

Advertisement

తాజా వార్తలు

Advertisement