Thursday, May 2, 2024

ఓజి హీరోయిన్ కి వెల్ క‌మ్ చెప్పిన టీం..

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ కల్యాణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సుజిత్ తో ఓజి చిత్రంలో న‌టిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ ముంబ‌యిలో ప్రారంభ‌మ‌యింది. కాగా ప‌వ‌న్ సినిమాలో హీరోయిన్ గా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొంతమందికి ఆ కల త్వరగా నిజమవుతుంది .. మరికొందరికి చాలా సమయం పడుతుంది. అయితే తెలుగులో రెండు ఫ్లాపులతో వెనుకబడిన హీరోయిన్ కి ప‌వ‌న్ సినిమ‌లో చేసే ఛాన్స్ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. నానీస్ గ్యాంగ్ లీడర్స్ సినిమాతో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ కి పరిచయమైంది. చక్కని కనుముక్కు తీరుతో ఈ సుందరి ఇక్కడి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది. కాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – ద‌ర్శ‌కుడు సుజీత్ కాంబినేషన్ లో ఓజీ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా నుంచి ప్రియాంక అరుళ్ మోహ‌న్ కి ఛాన్స్ వెళ్లింది. డీవీవీ దానయ్య నిర్మాణంలో ముంబైలో జరుగుతున్న ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ లో ఆమె జాయిన్ అయింది. ఆమెకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement