Sunday, April 28, 2024

ఓటిటికి నో ఛాన్స్ అంటున్న అక్కినేని అఖిల్ !!

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఆ హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కూడా ఓటీటీ లో రిలీజ్ కాబోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అదంతా రూమర్స్ అనే తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసే అవకాశం లేదని… థియేటర్స్ లో మాత్రమే విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement