Saturday, May 4, 2024

నెటిజన్స్ చేతిలో రష్మిక బలి !!

రష్మిక మందన్న… తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. అయితే ఇటీవల సుల్తాన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మీక మాట్లాడిన మాటలు ఆమె ను ఇప్పుడు చిక్కుల్లో పడేశాయి. ఇప్పుడు ఇదే విషయమై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన్న మాట్లాడుతూ… కొద్దిగా ఓవరాక్షన్ చేసింది.

కరోనా ఎలా ఉంది అంటూ వెటకారంగా మాట్లాడుతూ నన్ను మాట్లాడనివ్వండి రా. నాకు ఫ్లైట్ కు టైం అవుతుంది అంటూ మాట్లాడిన మాటలు నెటిజన్స్ కి కోపం తెప్పించాయి. అలాగే కార్తీ ని బాగా చూసుకోండి అంటూ చెప్పిన మాటలకు కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఓవరాక్షన్ కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందని లేదంటే ఇలానే ఉంటుందని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement