Saturday, May 11, 2024

అది నాకష్టార్జితం.. ఈడీసీ వెల్ల‌డించిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తన కష్టార్జితమని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ స్పష్టం చేశారు. రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్మోన్‌ చంద్రశేఖర్‌ ఇచ్చిన బహుమతులు కాదని ఆమె వెల్లడించారు. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని ఆమె గురువారం ఈడీని కోరారు.

కన్మోన్‌ సుభాష్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్విలైన్‌ పేర్కొన్నారు. ఇది నా సొంత సంపాదన. ఆ సమయంలో నా ప్రపంచంలో చంద్రశేఖర్‌ లేరు. దీనిని విడుదల చేయండి. అతడి నుంచి బహుమతులుగా తీసుకున్నానని నాపై ఆరోపణలు వచ్చాయని ఆమె తెలిపారు. ఇటీవల జాక్విలైన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ అటాచ్‌ చేసింది. అంతేకాదు, ఈడీ దాఖలు చేసిన రెండో సప్లమెంటరీ చార్జిషీట్‌లో జాక్విలైన్‌ ను నిందితురాలుగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement