Tuesday, May 7, 2024

సీఎం స్టాలిన్ ను కలిసిన సౌందర్య రజినీకాంత్

కరోనా కష్టకాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య ,కార్తీలు కోటి రూపాయలు విరాళంని అందించారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 25 లక్షల రూపాయల తనవంతు సహాయంగా అందించారు. ఇక తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ కోటి రూపాయలను విరాళంగా అందించారు.

సౌందర్య తన భర్త విశాఖన్ చెందిన ఫార్మా కంపెనీ ఆఫ్ అపెక్స్ లేబరేటరీ తరఫున ఈ విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ విరాళం అందించే సమయంలో తన మామగారు, భర్త, ఆయన సోదరి తో కలిసి స్టాలిన్ ను కలిశారు సౌందర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement