Friday, May 17, 2024

కొత్త కాన్సెప్ట్‌తో సెబాస్టియన్‌.. ఈ నెల 25 విడుద‌ల‌..

‘రాజావారు రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయమై ‘యస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ సినిమాతో మరో విజయం సాధించిన నటుడు కిరణ్‌ అబ్బవరం. తాజాగా తను నటిస్తున్న సినిమా సెబాస్టియన్‌ పిసి.524. గ్రామీణ కథతో నైట్ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది. వినోదానికి ప్రధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్నారు. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ప్రమోద్‌రాజు సంయుక్తంగా నిర్మిసున్నారు. ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్దారెడ్డి, జయచంద్రా రెడ్డి సహా నిర్మాతలు. నమ్రతా దారేకర్‌ , కోమలి ప్రసాద్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

”గీతా ఆర్ట్స్‌, యువి క్రియేషన్స్ లో వ‌చ్చిన‌ టాక్సీ వాలా, ద్వారక సినిమాలకి బాలాజీ సయ్యపురెడ్డి పని చేశారు. ఆ తర్వాత ఒక కొత్త కథ రాసుకొని కిరణ్‌ను కలసి కథ చెప్పడం జరిగిందట‌. సెబాస్టియన్‌ అను కానిస్టేబుల్‌ తనకున్న నైట్ బ్లైండ్ నెస్ వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే కథ బాగుందని, సినిమా చేద్దామన్నాడట కిర‌ణ్. మదనపల్లె రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో 32 రోజుల్లో షూటింగ్‌ చేసి పూర్తి చేసి, సినిమాకి సంబందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా యూన‌ట్ ఈ నెల 25న విడుదల చేయ‌బోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement