Thursday, May 2, 2024

ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీఎస్ సీఎస్, డీజీపీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేపు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. రాష్ట్రంలోని శంషాబాద్ మండలంలోని ముచ్చింతల శ్రీ రామనగరంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు. వివిధ శాఖల ఉన్నతాదికారులతో కలసి యాగశాలను సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఎం రాక నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement