Friday, May 17, 2024

సర్కారు వారి టీంకి మళ్ళీ కరోనా టెస్ట్ లు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం షూట్ స్టార్ట్ చేసే ముందు కరోనా నిబంధనలలో భాగంగా టీం అంతటికి మరోసారి కరోన టెస్టులు నిర్వహించనున్నారట. అందరికీ నెగిటివ్ వస్తే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement