Wednesday, May 1, 2024

కుస్తీ పడుతున్న రామ్ చరణ్, సోనూసూద్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెగాపవర్ స్టార్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ విలన్ గా కనిపించబోతున్నారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ సోనూసూద్ ల మధ్య లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే కొరటాల రైన్ ఫైట్ ను ప్లాన్ చేశాడు. ఇప్పుడు కుస్తీ పట్టే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారట. ఇది సినిమాకి మరో హైలెట్ గా నిలవబోతుందట. మరి ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement