Saturday, May 4, 2024

Sai Durga Tej | మెగా కాంపౌండ్‌ నుంచి మరో ప్రోడక్షన్ హైస్‌..

హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన తల్లి విజయదుర్గ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు తేజ్ ముందుగా తన ముగ్గురు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇక ఈ నిర్మాణ సంస్థలో తొలి ప్రాజెక్ట్ గా తమ స్నేహితులంతా కలిసి రూపొందించిన ‘సత్య’ అనే ఫీచర్ ఫిల్మ్ ను తీసుకురాబోతున్నారు.

ఈ నిర్మాణ సంస్థ లోగో కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘V’ అక్షరంలో దుర్గామాత‌ని ప్రతిబింబించేలా లోగో రూపొందించారు. ఇక‌ ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అంజనా ప్రొడక్షన్ హౌస్‌తో నాగబాబు, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో పవన్ కళ్యాణ్, కొణిదెల ప్రొడక్షన్స్, మెగా వి ప్రొడక్షన్స్‌తో రామ్ చరణ్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో నిహారిక, గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సుస్మిత… ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా సాయి దుర్గా తేజ్ కూడా కొత్త నిర్మాణ సంస్థతో వారి ఆలోచనల్లో చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement