Friday, May 10, 2024

అధ‌ర్వ‌ నుండి.. రింగా రింగా రోజే ఫ‌స్ట్ సింగిల్

మ‌హేశ్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న క్రైమ్ థిల్ల‌ర్ చిత్రం అధ‌ర్వ‌. ఈ చిత్రంలో కార్తీక్ రాజు హీరోగా న‌టిస్తున్నారు. సిమ్ర‌న్ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. రింగా రింగా రోజే అంటూ సాగే సాంగ్‌ ప్రోమో ను లాంఛ్ చేశారు మేకర్స్. హీరోయిన్‌ను ఫాలో అవుతూ హీరో పాడుకుంటున్న పాట మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్‌ చేసేలా ఉండబోతున్నట్టు ప్రోమోతో తెలిసిపోతుంది. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. రాజ్‌ కృష్ణ కొరియోగ్రఫీ చేశాడు. శ్రీచరణ్‌ పాకాల బ్యూటీఫుల్ ట్యూన్స్ రెడీ చేసినట్టు తాజా ప్రోమో చెబుతోంది. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో Peggo Entertainments బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలతో పోల్చితే డిఫరెంట్‌ ఫీల్ అందించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే దర్శకుడు హింట్‌ ఇచ్చేశాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement