Wednesday, May 1, 2024

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ర‌వితేజ‌.. త్వ‌ర‌లో హాలివుడ్ రిమేక్..!?

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. హిట్, ఫ్లాప్ ల‌కు సంబంధం లేకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌నకు సినిమాలు కూడా వ‌స్తున్నాయి. క్రాక్ మూవీతో భారీ హిట్ అందుకున్న త‌ర్వాత ఖిలాఢి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంత‌గా ఆకుట్టుకోలేదు. అయినా స‌రే స్పీడ్ ఏ మాత్రం త‌గ్గించ‌కుండా మ‌రో మూడు ప్రాజెక్టులను సెట్స్‌పై పెట్టాడు ర‌వితేజ. అలాగే మెగా స్టార్ చిరంజీవి, బాబీ సినిమాల్లోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలు పూర్తి కాకుండానే మరో కొత్త సినిమాకు ర‌వితేజ ఓకే చెప్పినట్టు వార్తలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అస‌లు గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేస్తోన్న ర‌వితేజ.. ధ‌మాకా, రావ‌ణాసుర చిత్రాలకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌లు త్వ‌ర‌లోనే పూర్త‌వుతాయి. ఆ వెంట‌నే మాస్ రాజా కొత్త సినిమాను షురూ చేయ‌బోతున్నార‌ని టాక్.

రీసెంట్ గా సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని చెప్పిన క‌థ‌, నెరేష‌న్ ర‌వితేజ‌కు న‌చ్చ‌టంతో ఆయ‌న ప‌చ్చ జెండా ఊపేశార‌ని టాక్‌. వీరు చేయ‌బోయే సినిమా 2014లో వ‌చ్చిన‌ హాలీవుడ్ మూవీ జాన్ విక్ మూవీకి రిమేక్ గా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి “ఈగ‌ల్” అనే టైటిల్ పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ర‌వితేజ, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఈ రీమేక్ సినిమాలో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement