Friday, April 26, 2024

నా తల్లిదండ్రులు కూడా నన్ను నమ్మలేదు – రష్మిక సంచలన వ్యాఖ్యలు

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత వరుస అవకాశాలతో హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఓ వైపు తెలుగు కన్నడలో సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.

వికాస్ బల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూతురు గా రష్మిక కనిపించనుంది. అయితే ఇదే విషయమై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు చిన్నప్పటి నుండి అమితాబ్ అంటే చాలా ఇష్టమని… ఆయనతో కలిసి పనిచేస్తానని అసలు ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. అమితాబ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన తల్లిదండ్రులు తనని నమ్మలేదని మా అమ్మ నాన్న కూడా అమితాబ్ కు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement