Monday, May 6, 2024

సైలెంట్ గా ఓటీటీలోకి వ‌చ్చేసిన.. రంగ‌మార్తాండ‌

భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన చిత్రం రంగ‌మార్తాండ‌. ఆరు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రాన్ని కృష్ణ‌వంశీ తెర‌కెక్కించాడు. కాగా ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి విజ‌యం సాధించింది.ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌, అనసూయ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ మంచి ఎమోషనల్‌ కంటెంట్‌తో కూడిన సినిమాను తీసారని ప్రశంసలు కురిపించారు.

ఇలా థియేటర్లలో పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న రంగమార్తాండ ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఏప్రిల్ 7నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా భారీ తారాగణంతో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ షాయరీ ఆలపించడం విశేషం. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత బ్రహ్మనందాన్ని ఘనంగా సన్మానించారు చిరంజీవి, రామ్‌చరణ్‌. త‌ల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్‌ చేస్తూ ఎంతో హృద్యంగా తెరకెక్కిన రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఇందులో సీరియస్‌ పాత్రలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. సినిమాలో ఆయన పోషించిన చక్రపాణి పాత్ర అందరినీ కంటతడి పెట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement