Monday, April 29, 2024

మంచులక్ష్మి టాక్ షోలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌కి బోయ్ ఫ్రెండ్‌తో రాక‌!

నటి రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్లకు పైగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది. తెలుగులో నటి లక్ష్మి మంచు టాక్‌షో అయిన ఫండ్ రైసర్ షో లో పాల్గొనడానికి ఈ యువ జంట త్వరలో హైదరాబాద్‌కు రానున్న‌ట్టు తెలుస్తోంది. ఫండ్ రైసర్ 8వ ఎడిషన్ ఈ నెల (ఫిబ్రవరి) 19న జరుగనుంది. లక్ష్మి మంచు, చైతన్య MRSKతో కలిసి 2014లో ఈ ఫండ్ రైసర్ ను ప్రారంభించారు.

ఇలా సేకరించిన నిధులన్నీ ‘టీచ్ ఫర్ చేంజ్’ కి ఏడాది పొడవునా విరాళంగా ఇస్తారు. ఇక ఈ ఫండ్ రైసర్ షోలో వివిధ సౌత్ & బాలీవుడ్ నటీనటులు, గాయకులు, క్రీడాకారులు పాల్గొననున్నారు. టీచ్ ఫర్ చేంజ్ ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు అంతటా 432 ప్రభుత్వ పాఠశాలలతో కలిసి 42,608 మంది నిరుపేద విద్యార్థుల జీవితాలను మార్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement