Sunday, May 5, 2024

విశ్వక్ సేన్ తో రకుల్ !

ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31- లేడీస్ నైట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో విశ్వక్ సేన్ తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒకరు నివేదా పేతురాజ్ కాగా మంజిమా మోహన్, రెబ మౌనిక జాన్, మేఘా ఆకాశ్ లు నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేసుకున్నారట. కొన్ని ఊహించని పరిణామాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చివరి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుందట. ప్రస్తుతం రకుల్, విద్యుల్లేఖ రామన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని విజయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విజయ్ తెరకెక్కించిన తలైవి చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement