Sunday, May 5, 2024

‘ఏక్ మినీ కథ’ కోసం రంగంలోకి ప్రభాస్

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఏక్ మినీ కథ. కరోనా కారణంగా చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇదిలా ఉండగా సంతోష్ హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కానీ ఆ టైం సెట్ కావట్లేదు.

కాగా ఇప్పుడు కట్ చేస్తే… సీన్ లో కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. నా కెరీర్ లో వర్షం అనే మరిచిపోలేని హిట్ ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ చేసిన ఏక్ మినీ కథ అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. యూనిట్ మొత్తానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్ నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement