Friday, May 17, 2024

‘ఆది పురుష్’ బడ్జెట్ విషయంలో ప్రభాస్ బ్యాక్ స్టెప్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్ సినిమాలతోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీత గా కనిపించబోతుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముంబై నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

కాగా సడన్ గా షూట్ షిఫ్ట్ నేపథ్యంలో బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని ప్రభాస్ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రభాస్ ఈ చిత్రం బడ్జెట్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటున్నడట. మరి బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి. ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్తో భూషణ్ కుమార్ ,కిషోర్ కుమార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement