Friday, May 3, 2024

దండకారణ్యంలో కరోనా మరణ మృదంగం..10 మందికి పైగా మావోయిస్టులు మృతి

క‌రోనా వైర‌స్ అడ‌వుల్లో ఉండే మావోయిస్టుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ లోని దంతెవాడ జిల్లా ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ వెల్ల‌డించారు. మ‌రో 100 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్లు త‌మ‌కు సమాచారం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా సోక‌డం, క‌లుషిత ఆహారం తిన‌డంతో మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనాతో చ‌నిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. వైద్యం, మెడిసిన్ అందుబాటులో లేకపోవడమే మరణాలకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement