Saturday, May 11, 2024

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్..

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా సోకింది. తనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సంక్రమించిందని, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని పోసాని స్వయంగా పేర్కొన్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో తాను నటిస్తున్న రెండు సినిమాల షూటింగులు వాయిదా పడినట్టు తెలిపారు. తన కారణంగా ఇబ్బందులకు గురైన దర్శక నిర్మాతలు, హీరోలు క్షమించాలని కోరారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే కరోనా నుంచి కోలుకుని బయటపడతానని పోసాని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : ఏసీబీ వలలో చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్

Advertisement

తాజా వార్తలు

Advertisement