Thursday, May 2, 2024

ఒబెరాయ్ ఉద‌య‌విలాస్ లో న‌టి ప‌రిణితీ.. రాఘ‌వ‌ల వివాహం

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. కాగా వారి పెళ్లిళ్లు రాజ‌భ‌వ‌నాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. కాగా ఉదయ్ పూర్ రాజభవనంలో బాలీవుడ్ న‌టి ప‌రిణితీచోప్రా..రాఘ‌వ్ చ‌ద్దాల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో అనేక ఫ్రముఖ విలాసవంతమైన హోటళ్లు.. రాజభవనాల‌కు ప్రసిద్ధి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలకు ఈ ప్రదేశం ఉత్తమ ఎంపిక. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జంటలు రాజస్థాన్ లోనే వివాహం చేసుకున్నారు.ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పరిణీతి, రాఘవ్ ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయవిలాస్ లో తమ పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇది పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. పరిణితి చోప్రా సోదరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఉమైద్ భవన ప్యాలెస్ లో డెస్టినేషన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు రెండు కుటుంబాలలో పెద్ద భాగం. అందుకే సాధ్యమైనంతవరకు తమ పెళ్లిని సాంప్రదాయంగా.. సన్నిహితులు, బంధువుల మధ్య జరగాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement