Sunday, April 28, 2024

టాప్ ట్రెండింగ్ లో నిత్యా మీనన్ “కుమారి శ్రీమతి”.. ఆకట్టుకుంటున్న సిరీస్

టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ తాజాగా ‘కుమారి శ్రీమతి’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. వైజయంతీ మూవీస్‌కు చెందిన ఎర్లీ మోషన్ టేల్స్ & స్వప్న సినిమాస్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28 నుండి తెలుగు, తమిళం, మలయాళంచ‌, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి వ‌చ్చింది.

అయితే, ఓటీటీలో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. శ్రీనివాస్ అవసరాల ఈ సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించగా, తాళ్లూరి రామేశ్వరి, గౌతమి, ప్రణీత పట్నాయక్, నిరుపమ్, తిరువీర్, నరేష్ మరియు ప్రేమ్ సాగర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement