Monday, April 29, 2024

పవన్ సరసన నిత్యా మీనన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది. అందులో ఒకటి సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. మరోవైపు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ సరసన మొదట సాయి పల్లవి ని అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఆ ఆఫర్ కు నో చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ ను నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement