Saturday, May 4, 2024

నాలుగు భాషలలో విడుదల కానున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా -టైలర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

.ఈ సందర్భంగా దర్శకుడు పి.మహేశ్‌ బాబు మాట్లాడుతూ ”మా సినిమా -టైలర్‌ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒక కొత్త కాంబినేషన్‌ లో నవీన్‌, అనుష్క, యూవీ క్రియేషన్స్‌, నేను కలిసి సినిమా చేశామంటే అందుకు ప్రేరణ కలిగించింది కథే.” అని అన్నారు

.హీరో నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ ”జాతి రత్నాలు తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి గురయ్యాను. ఆ సినిమాతో మీరు నాపై చూపించిన అభిమానం ఎంతో కదిలించింది. మిమ్మల్ని ఎలా ఎంటర్‌ -టైన్‌ చేయాలి. ఇంకా ఎలాంటి కొత్త సబ్జెక్ట్‌ తీసుకోవాలి అని ఆలోచించాను. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే మీకు ది బెస్ట్‌ మూవీ ఇవ్వాలని చాలా కథలు విన్నాను. ఆ క్రమంలో మహేశ్‌ చెప్పిన ఈ స్టోరి చాలా నచ్చింది. ఇలాంటి సబ్జెక్ట్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్‌ కామెడీ క్యారెక్టర్‌ తో ఫుల్‌ లెంగ్త్‌ సినిమా తెలుగులో రాలేదు. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టా. మా సినిమాలో ఒక యూనిక్‌ పాయింట్‌ ఉంది. అనుష్క హీరోయిన్‌ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్‌ బాగుంది.” అన్నారు. ఇంకా నటు-డు మహేశ్‌ ఆచంట కూడా మాట్లాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement